భారతదేశం, ఏప్రిల్ 19 -- ఇటీవల హైదరాబాద్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఓ బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు. ఆ లేఖలోని అంశాలను పరిశీలించిన హైడ్రా టీమ్.. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాపాడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భాగ్యనగరంలోని భూములను కాపాడటానికి హైడ్రా కృషి చేస్తోంది. చాలాచోట్ల నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసింది. అంతేకాదు.. చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లను నేలమట్టం చేసింది. ఇవన్నీ గమనించిన ఓ బాలుడు.. తాను గమనించిన ఓ విషయాన్ని లేఖ ద్వారా తెలిపాడు.

ఆ బాలుడు చాలా రోజులుగా జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని బహిరంగ స్థలంలో క్రికెట్ ఆడుకునేవాడు. సెడెన్‌గా ఆ ప్రదేశంలోకి ప్రవేశం లేదు అనే బోర్డు దర్శనమిచ్చింది. ప్రాంతం చు...