భారతదేశం, జూన్ 2 -- అమరావతి, జూన్ 2: రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు జూన్ 5న భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని బహిరంగ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది గ్రీన్ కవర్ 29 శాతం నుంచి 30.5 శాతానికి పెరిగింది. 2047 నాటికి 50 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వార్షికంగా 1.5 శాతం పెంచాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారుల వెంబడి సరైన ట్రీ గార్డులతో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో ప్రతి మొక్కను జియోట్యాగింగ్ చేసి శాటిలైట్ చిత్రాల ద్వారా పర్యవేక్షించాలని, సరైన సంరక్షణ, మనుగడ ఉండేలా చ...