భారతదేశం, మే 27 -- తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పోస్టర్ ను టీటీడీ ఈవో జె. శ్యామల రావు ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం ఆయన పోస్టర్ ను ఆవిష్కరించారు.

టీటీడీ ఈవో మాట్లాడుతూ, వేసవి నేపథ్యంలో శ్రీగోవిందరాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

ఆలయంలో చలువ పందిళ్లు, వైట్ పెయింట్, ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పలంకరణలు తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న వాహనసేవలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

జూన్ 01వ...