భారతదేశం, మే 20 -- రాష్ట్ర వ్యాప్తంగా 29 వేల రేషన్ షాపుల్లో సరకుల సరఫరా చేసే వ్యవస్థపై గత ప్రభుత్వంలో కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 9260 రేషన్ పంపిణీ వాహనాలు ఏర్పాటు కోసం రూ.1860 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు.

"ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తామని మాయమాటలు చెప్పారు. రేషన్ సరకులు ఇంటింటికీ రేషన్ సరకులు డోర్ డెలివరీ చేయలేదు. వీధిలో ఎక్కడో ఒక చోట పెట్టి, సరకులు ఇచ్చేవారు.

దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. రేషన్ రైస్ స్మగ్లింగ్...మీ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రారంభమైంది. ఈ వ్యాన్ల వల్ల పారదర్శకత లోపించింది. ఈ వ్యాన్ ఆపరేటర్లపై వందల కేసులు ఉన్నాయి" - మంత్రి నాదెండ్ల మనోహర్ ...