భారతదేశం, మే 28 -- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాజీవ్ యువ వికాసం యూనిట్లను అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబరు 2 నాటికి తెలంగాణలో 5 లక్షల మంది యువతకు రూ.8,000 కోట్ల విలువైన స్వయం ఉపాధి యూనిట్లను అందచేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాజీవ్ యువవికాసం పథకం లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి స్కీమ్‌ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు అన్ని నియోజక వర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని భట్టి ఆదేశించారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా శిక...