Hyderabad, మే 3 -- కైలాస మానస సరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ 30 నుండి ప్రారంభమవుతుంది. ఈ యాత్ర చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు సిద్ధమవుతున్నారు. శివుని నివాసమైన కైలాసాన్ని సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

కైలాస పర్వతం కేవలం హిందూ మతస్థలమే మాత్రమే కాదు బౌద్ధ, జైన, సిక్కు మతస్తులకు కూడా పవిత్రమైన ప్రదేశంగానే చెప్పుకుంటారు. దీన్ని స్వర్గంగా పిలుచుకుంటారు.

స్వర్గానికి దారి కైలాస పర్వతమేనని అంటారు. అయితే ఇప్పటికీ కైలాస పర్వతానికి సంబంధించిన కొన్ని విషయాలకు శాస్త్రవేత్తలు కూడా సమాధానాలు చెప్పలేకపోతున్నారు. అవి ఇప్పటికీ రహస్యాలగానే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

కైలాస పర్వతం ఎత్తు ఎవరెస్ట్ కంటే చాలా తక్కువ. ఎవరెస్టు పర్వతాన్ని ఇప్పటికే ఎంతోమంది ఎక్కారు. అయితే ఇప్పటివరకు కైలాస పర్వతాన్ని మాత్రం అధిరోహించలేకపోయారు. ఈ పర్వతాన్ని ఎక్కడానికి ...