భారతదేశం, మే 22 -- ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన ఏకైక ఇండియన్ సినిమా 'హోమ్‌బౌండ్‌'. ఈ మూవీలో జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా కీ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీకి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో అరుదైన గౌరవం దక్కింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ మూవీని ప్రదర్శించారు. ఈ మూవీ చూసిన ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు 9 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కినట్లు మూవీ టీమ్ పేర్కొంది.

నీరజ్ ఘాయ్వాన్ దర్శకత్వం వహించిన 'హోమ్‌బౌండ్‌' మూవీకి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'అన్ సర్టెయిన్ రిగార్డ్' విభాగంలో ఈ చిత్రాన్ని ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రదర్శించారు. ఈ మూవీలో జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ యాక్టింగ్.. నీరజ్ టేకింగ్ కు ఫుల్ మార్క్స్ పడ్డట్లు తెలిసింది. ఈ మూవీ చూసిన ఆడియన్స్ 9 నిమిషాల పాటు స్టాండి...