Hyderabad, మే 3 -- జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఇందులో చిట్టి పాత్రతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్‌గా అలరిస్తోంది ఫరియా అబ్దుల్లా.

ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో, డిఫరెంట్ టైటిల్‌తో రానుంది ఫరియా అబ్దుల్లా. ఆ సినిమానే గుర్రం పాపిరెడ్డి. ఓటీటీ సిరీస్ వికటకవితో మంచి పేరు తెచ్చుకున్న నరేష్ అగస్త్య గుర్రం పాపిరెడ్డి మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాను డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు.

డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ గుర్రం పాపిరెడ్డి సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో...