భారతదేశం, జూన్ 9 -- సాక్షి టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావును ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలను కించపరిచారన్న అభియోగంపై ఆయనను అరెస్టు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీలో ఉన్న కొమ్మినేని ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.

సాక్షి టీవీలో చర్చా కార్యక్రమంలో సందర్భంగా అసభ్యకరంగా మాట్లాడారంటూ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష, పలువురు మహిళల ఫిర్యాదు మేరకు కొమ్మినేనిపై గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ వ్యవహారంలో కొమ్మినేనితోపాటు సాక్షి యాజమాన్యం, జర్నలిస్టు కృష్ణం రాజుపైనా పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

రాజకీయ, మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్...