భారతదేశం, మే 8 -- గురువారం రాత్రి జమ్మూ నగర విమానాశ్రయం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. వెంటనే భారత్ దీటుగా స్పందించింది. పాకిస్థాన్ చేస్తున్న దాడులను తిప్పికొట్టింది. ఆపరేషన్ సిందూర్‌ రెండో రోజు కూడా కొనసాగుతోంది.

జమ్మూ ప్రాంతాన్ని పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుని మందుగుండు సామగ్రితో దాడి చేసింది పాక్. దీనికి భారత వైమానిక రక్షణ దళాలు దీటుగా స్పందించడతో జమ్మూలో ఉద్రిక్తతలు పెరిగాయి. కిష్త్వార్ జిల్లాలో పూర్తిగా బ్లాక్‌అవుట్ అమలు అయింది. ఆ ప్రాంతం అంతటా సైరన్‌లు మోగుతున్నాయి. జమ్మూ ప్రస్తుతం సైరెన్లు, రక్షణ దళాలతో ఆందోళన నడుమ ఉంది.

పాకిస్థాన్ తన దాడిలో జమ్మూ నగర విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉండటంతో జమ్మూ ప్రాంతంలో పూర్తిగా బ్లాక్‌అవుట్‌ను ...