భారతదేశం, మే 9 -- మ్మూ, సాంబా, పఠాన్‌కోట్‌లలో డ్రోన్‌లను గుర్తించారు. అధికారుల ప్రకారం, జమ్మూ ప్రాంతంలో వరుసగా రెండో రాత్రి కూడా నగరం అంధకారంలో మునిగిపోయింది. పేలుళ్ల శబ్దాలు, సైరన్‌లు వినిపించాయి. జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్‌అవుట్ విధించారు.

జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్ సెక్టార్‌లలో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రక్షణ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ తెలిపింది. భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్థాన్ డ్రోన్లను అడ్డుకున్నప్పుడు సాంబాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ డివిజన్‌లోని ఉధంపూర్‌లో కూడా పూర్తి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. సైరన్‌లు వినిపిస్తున్నాయి. శ్రీనగర్‌లో ముందు జాగ్రత్త చర్యగా స్థానికులకు లైట్లు ఆపివేయమని తెలియజేశారు.

పేలుళ్ల శబ్దాల గురించి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 'జమ్మూలో ఇప్పుడు బ్లాక్...