భారతదేశం, ఏప్రిల్ 17 -- గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌కి చెందిన పలువురు వైసీపీ కార్పోరేటర్లు జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.

విశాఖ కార్పొరేషన్‌కు చెందిన వైసీపీ కార్పొరేటర్లు గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ కార్పోరేటర్లకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

గ్రేటర్ విశాఖ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు, గాజువాక 74వ డివిజన్ కార్పోరేటర్ తిప్పల వంశీరెడ్డి, గ్రేటర్ విశాఖ వైసీపీ యువజన విభాగం నాయకుడు ఆళ్ల శివ గణేష్‌తో పాటు ఆయ‌న అనుచరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

విశాఖ దక్షిణ నియోజకవ...