Hyderabad, మే 23 -- కొన్ని ఆసనాలు వేయడం కష్టంగా ఉంటుంది. కానీ వృక్షాసనం మాత్రం వేయడం చాలా సులువు. ఒక కాలు మీద నిలబడి చేసే ఈ ఆసనం వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరైతే స్థిరత్వం తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో వారు ఈ ఆసనాన్ని అలవాటు చేసుకోండి. ఇది ఒత్తిడి తగ్గించడంతోపాటు మీలో ఆలోచనలు స్థిరంగా ఉండేలా చూస్తుంది.

ఒక మనిషికి స్థిరత్వం చాలా అవసరం. లేకుంటే ఒక పని మీద లేదా ఒక ఆలోచన మీద దృష్టి నిలబడదు. ఆలోచనల్లో స్థిరత్వం ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే మనసులో గందరగోళంగా కలత చెందినట్టు అనిపిస్తుంది. లక్ష్యంపై దృష్టి సారించడం కష్టంగా మారుతుంది. అందుకే స్థిరమైన ఆలోచనలు కావాలంటే ముందు మీ మనసును స్థిరంగా ఉంచుకోవాలి. అందుకు వృక్షాసనం అవసరం. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.

వృక్షాసనం వేయడం వల్ల మీ శరీరంలో కూడా సమతుల్యత పెరుగుతుంది. శరీ...