భారతదేశం, జూన్ 2 -- ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న ఆ టీమ్.. ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం (జూన్ 1) క్వాలిఫయర్ 2లో ముంబయి ఇండియన్స్ ను పంజాబ్ కింగ్స్ చిత్తుచేసింది. ఈ మ్యాచ్ లో విజయంతో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆ టీమ్ కో ఓనర్ ప్రీతి జింటా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఆటగాళ్లను చూసి ఆమె కన్ను కొట్టిన వీడియో తెగ వైరల్ గా మారింది.

శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ కింగ్స్ ను గెలిపించాడు. ముంబయి పై ఐదు వికెట్ల తేడాతో, ఆరు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అతను మ్యాచ్ విన్నింగ్ సిక్స్ కొట్టిన వెంటనే పంజాబ్ కింగ్స్ డగ్అవుట్ లో ఉత్సాహం పెరిగింది.

పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటి...