Hyderabad, ఆగస్టు 6 -- స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం 'త్రిబాణధారి బార్బరిక్'. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్ర పోషించారు.

అలాగే, త్రిబాణధారి బార్బరిక్ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, యాంకర్ ఉదయ భాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నటీనటులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సత్యరాజ్ మాట్లాడుతూ .. "త్రిబాణధారి బార్బరిక్ సినిమాలో పని చేసినందుకు ఆనందంగా ఉంది. మేమంతా కూడా మాదే మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కానీ, ఇందులో కథే మెయిన్ హీరో. డైరెక్టర్ మోహన్, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ...