భారతదేశం, మే 7 -- ఓ హీరోతో సినిమా అనుకొని మ‌రో హీరోతో తీయ‌డం అన్న‌ది ఇండ‌స్ట్రీలో కామ‌న్‌గా క‌నిపిస్తుంది. అలా వ‌చ్చిన చాలా సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అయ్యాయి. డిజాస్ట‌ర్లుగా నిలిచిన‌వి ఉన్నాయి. ఓ స్టార్ హీరో న టించిన మూవీ ఫ‌స్ట్ డే సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్నది. కానీ అనూహ్యంగా మ‌రో హీరో పెట్టిన కేసు కార‌ణంగా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. నిర్మాత‌కు న‌ష్టాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమానే కొండ‌ప‌ల్లి రాజా.

వెంక‌టేష్ హీరోగా ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో 1993లో కొండ‌ప‌ల్లి రాజా మూవీ రిలీజైంది. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన అన్నామ‌లై రీమేక్‌గా కొండ‌ప‌ల్లి రాజాను తెర‌కెక్కించారు ర‌విరాజా పినిశెట్టి. తొలుత అన్నామ‌లై రీమేక్‌ను చిరంజీవితో చేయాల‌ని ప్రొడ్యూస‌ర్ అనుకున్నార‌ట‌.

చిరంజీవికి...