Hyderabad, మే 29 -- టాలీవుడ్ ముగ్గురు యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం సినిమాను కెకె రాధామోహన్ నిర్మించగా.. డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పించారు.

భైరవం మూవీ మే 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో హీరో నారా రోహిత్ పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌పై నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

-నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు ఈ కథ గురించి ఫోన్ చేసి చెప్పారు. ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. శశి కుమార్ క్యారెక్టర్ గురించి చెప్పారు. నేను సినిమా చూశాను. చాలా నచ్చింది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. తమిళ్‌లో దీన్ని ఒక రస్టిక్ విలే...