భారతదేశం, నవంబర్ 2 -- అఖిల్, తేజస్విని జంటగా నటించిన మూవీ రాజు వెడ్స్ రాంబాయి. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు.

రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. నవంబర్ 21న "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు.

ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సాయిల...