భారతదేశం, జూన్ 2 -- ఐపీఎల్ 2025లో ఆదివారం (జూన్ 1) పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ థ్రిల్ ను అందించింది. ఈ క్వాలిఫయర్ 2లో గెలిచిన పంజాబ్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ డేంజరస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ స్పిన్నర్ చాహల్ కు దక్కింది. ఆ వికెట్ పడ్డాక చాహల్ గాసిప్ గర్ల్ ఫ్రెండ్ మహ్వాశ్, పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ గా మారింది.

ఇంటర్నెట్ సెన్సేషన్, నటి ఆర్‌జే మహ్వాశ్ ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ కు సపోర్ట్ చేస్తోంది. ఆ టీమ్ లో ఉన్న స్పిన్నర్ చాహల్ తో ఆమె రిలేషన్ షిప్ లోనే ఉన్నారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ముంబయి ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు కూడా మహ్వాశ్ అటెండ్ అయింది. మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ వికెట్ చాహల్ తీయడంతో మ...