భారతదేశం, మే 4 -- ార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ నుంచి పెద్ద అప్డేట్ వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో మే 5 నుంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో యాత్రికులు ప్రయాణ మార్గంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో మే 5 నుంచి రెండు, మూడు రోజుల పాటు వడగండ్ల వాన, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉండనున్నాయి.

ఆది, సోమ, మంగళవారాల్లో కొండ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, మైదాన ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కు...