Hyderabad, మే 18 -- చార్మినార్ కు సమీపంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆక్షించారు.

మీర్‌చౌక్‌ భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారు. నలుగురు అరవై ఏళ్ళ నుంచి డెబ్బై ఐదేళ్ల ఏళ్ల వయస్సు వారు ఉన్నారు. మరో ఐదుగురు ముప్పై నుంచి నలభై ఏళ్ల లోపు వయస్సు వారు ఉన్నారు.

అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

రాజేంద్రకుమార్‌ (67)

అభిషేక్‌ మోదీ (30)

రజని అగర్వాల్‌

అన్య మోదీ

పంకజ్‌ మోదీ

వర్ష మోదీ

ఇద్దిక్కి మోదీ

రిషభ్‌

ప్రథమ్‌ అగర్వాల్‌

ప్రాంశు...