భారతదేశం, మే 13 -- తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఓరుగల్లు నగరం. కాకతీయుల రాజధానిగా వెలుగొందిన ఈ నగరం.. చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, శిల్ప కళా వైభవానికి నిదర్శనం.

ఎన్నో అద్భుత కట్టడాలు, అబ్బురపరిచే శిల్ప కళా సంపదకు నిలయమైన ఓరుగల్లు ఖ్యాతి మరోసారి ప్రపంచ వ్యాప్తం కానుంది.

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 57 మంది ప్రపంచ అందగత్తెలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుండగా, ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అందులో వివిధ దేశాల నుంచి తరలివస్తున్న ముద్దుగమ్మలు 35 మంది హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, వరంగల్ లోని కోట, మరో 22 మంది ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ.. జరూర్ ఆనా'అనే థీమ్‌తో ప్రణాళిక రచించింది. అంతగత్తెల పర్యటనతో ఓరుగల్లు చరిత్ర, చారిత్ర...