భారతదేశం, ఏప్రిల్ 19 -- చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌కు 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా.. తెలంగాణ ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి రైళ్లరాకపోకలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే అధికారుల సహకారంతో.. రైళ్లలో వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పలు ప్రాంతాలకు సిటీ బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల ప్రయాణికులకు మేలు జరగనుంది.

చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌, ఉప్పల్‌, మోహిదీపట్నం, బోరబండ, కోఠి, అఫ్జల్‌గంజ్‌ ప్రాంతాలకు నడుపుతున్న బస్సులతో పాటు.. మరిన్ని బస్సులు పెంచే దిశగా ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చర్లపల్లి నుంచి తెల్లవారుజామున 4.20 నుంచి.. రాత్రి 10.15 గంటల వరకు.. పది నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు.

ప...