భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఓ వైపు ప్రభుత్వాలు మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నా.. సీక్రెట్‌గా వాటిని తయారుచేసి తరలించేవారు తరలిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో పెద్ద డ్రగ్ డెన్ బయపడింది. ఇందులో వందల కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలు దొరికాయి. కెమికల్ ఫ్యా్క్టరీ పేరుతో ఈ దందా నడుస్తోంది.

చర్లపల్లి పారిశ్రామికవాడలోని నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో పోలీసులు సోదాలు చేశారు. 5.79 కిలోల ఎండి(మెఫెడ్రోన్), 35,500 లీటర్ల రసాయన ద్రావణాలు, 950 కిలోల పౌడర్, మాదకద్రవ్యాల తయారీ పరికరాలు, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేశారు.

చిన్న లింక్ ఆధారంగా డ్రగ్ రాకెట్‌ను థానే జిల్లాలోని ఎంబీవీవీ పోలీసులు పట్టుకున్నారు. ఆగస్టు 8, 2025న కాశీమిరా బస్ స్టాప్ సమీపంలోని ...