భారతదేశం, జూన్ 16 -- తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమించబోతున్నారనే ఊహాగానాల మధ్య, ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సంచలన సూచన చేశారు. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుని, ముఖ్యమంత్రి బాధ్యతలు తన కుమారుడు, మంత్రి లోకేష్‌కు అప్పగించాలని ఓవైసీ అన్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదివారం రాత్రి జరిగిన ఒక సమావేశంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ (సవరణ) చట్టం పట్ల కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చట్టం ముస్లింల హక్కులను ఉల్లంఘిస్తుందని ఆయన ఆరోపించారు.

"చంద్రబాబు నాయుడు గారూ, మీకు చెబుతున్నా, మీరు లోకేష్ భవిష్యత్తును (రాజకీయంగా) నాశనం చేస్తున్నారు. మీ తర్వాత ఎలాగైనా మీ కొడుకే (వారసుడిగా) బాధ్యతలు స్వీకరిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ రాడు కదా? మీరు లో...