భారతదేశం, మే 3 -- రాష్ట్రంలో మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు.. ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదని.. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రామాలతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారు.. ఇది న్యాయమేనా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

'చంద్రబాబు గారూ.. మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా.. నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్‌ గాని కొనకుండా అన్నం ...