భారతదేశం, జనవరి 23 -- హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్లాట్ కోనుగొలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీలాంటి వారికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. తొర్రూర్, బహదూర్‌‌‌‌‌‌‌‌పల్లి, కుర్మల్‌‌‌‌‌‌‌‌గూడ ప్రాంతాల్లో ఉన్న 137 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను వివరాలను ప్రకటించింది.

స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 137 ఓపెన్ ప్లాట్లను ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం ప్రకటించారు.

ఆసక్తిగల వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చే...