భారతదేశం, జూన్ 10 -- ఎస్​ఎస్సీ సీజీఎల్​ 2025 పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ ఎస్​ఎస్సీ. అభ్యర్థులు ఎస్​ఎస్సీ అధికారిక వెబ్​సైట్​ ssc.gov.in లో ఈ కంబైన్డ్​ గ్రాడ్యుయేట్​ లెవల్​ ఎగ్జామ్​కి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్​ఎస్సీ సీజీఎల్​ 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ జూన్​ 9న ప్రారంభం అయ్యింది. అప్లికేషన్​కి చివరి తేదీ జులై 4 అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్​లైన్​లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జులై 5.

అప్లికేషన్​ కరెక్షన్​ విండో జులై 9న మొదలై, 11తో ముగుస్తుంది. టైర్​ 1 పరీక్ష ఆగస్ట్​ 13 నుంచి ఆగస్ట్​ 30 వరకు జరుగుతుంది.

ఈ దఫా ఎస్​ఎస్సీ సీజీఎల్​ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​లో భాగంగా.. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ వ్యవస్థలు, ట్రిబ్యునల్స్​లోని గ్రూప్​ బీ, గ్రూప్​ సీకి సంబంధించిన 14582 ఖాళీల...