భారతదేశం, జూన్ 9 -- బంగారం, వెండిపై రుణాలకు రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం బంగారం, వెండి రుణాలు తీసుకునే వారికి బ్యాంకులకు సంబంధించి కొత్త నియమాలు వచ్చాయి. ఆర్బీఐ కొత్త బంగారు రుణ నియమాలు అన్ని రకాల వాణిజ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తాయి. బంగారం, వెండి ఆభరణాలు లేదా నాణేలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారు 8 కీలక మార్పుల గురించి తెలుసుకోవడం కచ్చితంగా అవసరం

బంగారం రుణగ్రహీతలకు ఇప్పుడు బంగారం విలువలో 85 శాతం రుణం ఇస్తారు. ఇది గతంలో 75 శాతం నుండి పెంచారు. ఈ కొత్త లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) పరిమితి వడ్డీతో సహా రూ. 2.5 లక్షల వరకు రుణాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు మీ బంగారం రూ. 1 లక్ష విలువైనది అయితే మీరు ఇప్పుడు గరిష్టంగా రూ. 85,000 రుణం పొందవచ్చు. గతంలో ...