భారతదేశం, మే 18 -- హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారి తీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన సీఎం... అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్​లో మాట్లాడి సహాయక చర్యలను ప...