భారతదేశం, మే 2 -- కర్రెగుట్టలపై 11వ రోజు ఆపరేషన్‌ కొనసాగుతుంది. రెండు గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా పదుల సంఖ్యలో కొండలు, సొరంగాలు ఉన్నాయి. వాటిపై కూంబింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో జవాన్లకు ఆపరేషన్‌ సవాల్‌గా మారింది. బలగాలు.. హెలికాప్టర్లు, డ్రోన్లపైనే ఆధారపడ్డాయి. అటు మావోయిస్టులు సేఫ్‌జోన్‌లోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. హెలికాప్టర్ల నుంచి ఫ్లాష్‌ బాంబులతో బలగాలు దాడులు చేస్తున్నాయి. కర్రెగుట్టలో బేస్‌ క్యాంపుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి.

అయితే.. ఆపరేషన్ కగార్, బచావో కర్రెగుట్టల చర్యలు ఎలా ఉన్నా.. సమీప గ్రామాల్లోని ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల మీదుగా పోలీసులు రోజూ వెళుతుండడం, చెంతనే ఉన్న గుట్టలపై బాంబుల శబ్దాలు వినిపిస్తుండటంతో.. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నామన...