భారతదేశం, జూన్ 2 -- నార్వే చెస్ 2025లో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష సంచలన విజయం సాధించాడు. ప్రపంచ నంబర్ వన్, మేటి ఆటగాడు మాగ్నస్ కార్ల్ సన్ ను ఓడించాడు. ఎండ్ గేమ్ లో అద్భుతంగా పుంజుకున్న గుకేష్.. ప్రత్యర్థి తప్పిదాన్ని సద్వినియోగం చేసుకుని కార్ల్ సన్ పై తొలి క్లాసికల్ విజయాన్ని నమోదు చేశాడు.

క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్ సన్ పై ఫస్ట్ విక్టరీని అందుకుంటూ గుకేష్ గెలిచిన శైలిని అభిమానులు, నిపుణులు 'టర్నరౌండ్ ఆఫ్ ది ఇయర్' అని పిలుస్తున్నారు. ఈ విజయంతో కార్ల్ సన్ కూడా అంతే ఉలిక్కిపడి కోపంతో టేబుల్ ను కొట్టాడు. ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ కావడంతో కామెంటేటర్లు, అభిమానులు షాక్ కు గురయ్యారు. కార్ల్ సన్ టేబుల్ కొట్టిన తర్వాత, అతను గుకేష్ తో కరచాలనం చేశాడు.

కార్ల్ సన్ పై గెలుపు తర్వాత గుకేష్ కూడా నమ్మశక్యంగానే చూశాడు. కార్ల్ సన్ పై మొదటి క్లాసికల్...