భారతదేశం, మే 15 -- మీనా ఇంటికొస్తారు పార్వ‌తి, సుమిత్ర‌. వారిపై మాట‌ల‌తో విరుచుకుప‌డుతుంది ప్ర‌భావ‌తి.అస‌లు ఏంటి గొడ‌వ‌...మీ వాడు ఏ త‌ప్పు చేశాడ‌ని బాలు చేయి విర‌గొట్టాడ‌ని పార్వ‌తిని అడుగుతుంది ప్ర‌భావ‌తి. రాజేష్ కోసం జ‌రిగిన గొడ‌వ‌లో శివ చేయిని బాలు విరిచేశాడ‌ని సుమ‌తి అంటుంది.

ఇది న‌మ్మేట‌ట్లు ఉందా ప్ర‌భావ‌తి బ‌దులిస్తుంది. శివ‌నే చేయ‌కూడ‌ని ప‌ని ఏదో చేసి ఉంటాడ‌ని అంటుంది. వాడు ఏ త‌ప్పు చేయ‌డ‌ని, చ‌దువుకునే పిల్లాడిమీద లేనిపోని నింద‌లు వేయ‌ద్ద‌ని కొడుకును వెన‌కేసుకొస్తుంది పార్వ‌తి. శివ గురించి ఇక్క‌డేం మాట్లాడొద్ద‌ని, మీరు ఎందుకొచ్చారో అది చెప్ప‌మ‌ని త‌ల్లితో అంటుంది మీనా.

నాకు బొట్టు పెట్టుకునే రాత లేద‌ని వ‌దిన అన్నారుగా...ఆ రాత చెరిగిపోయి ఏడాది అవుతుంద‌ని, సంవ‌త్స‌రీకం చేస్తున్నామ‌ని స‌త్యంతో పార్వ‌తి చెబుతుంది. ఆ సంవ‌త్స‌రికానికి...