Hyderabad, మే 19 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన బాలును సత్యం నిలదీస్తాడు. అత్తింటికి వెళ్లి నువ్ చేసిందేంటీ. అక్కడ జరుగుతున్న కార్యం ఏంటీ, నువ్ చేసిందేంటీ అని సత్యం అంటాడు. అక్కడ ఈ ప్రభావతమ్మా, పార్లరమ్మ లాంటివాళ్లను పోగేసి పెట్టారు. నన్ను తల ఓ మాట అన్నారు. ఇంటికి పిలిచి అవమానిస్తే నేనేందుకు ఊరుకుంటాను అని బాలు అంటాడు.

అంటార్రా. తండ్రి లేడు, తల్లి కష్టపడుతుంది. కొడుకుల చూసుకోవాల్సిన అల్లుడు కష్టం తీసుకొస్తే నాలుగు మాటలు అంటారు అని సత్యం అంటాడు. మాకెవరు ఉన్నారు. ఆ చుట్టూ పక్కల వాళ్లే బంధువులు. శివకు చేయి బాగోలేక మా నాన్నకు దీపం కూడా పెట్టుకోలేకపోయాడు. అంతా చెడగొట్టి వచ్చారు. మేము బాగుంటేనే కదా మా నాన్న ఆత్మకు శాంతి. ఎవరు తినలేదు. ఎవరి మనసు ప్రశాంతంగా లేదు. ఏంటీ కోపం, ఎందుకీ పగ. నా కుటుంబం మీద ఎందుకింత కక...