భారతదేశం, మే 27 -- బాలు ఆటో ఎక్కుతుంది రోహిణి. తాను కారు అమ్మేసి ఆటో న‌డుపుతోన్న విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా రాజేష్‌కు ఫోన్ చేసి కొత్త నాట‌కం ఆడుతాడు బాలు. వెంక‌టేష్ అనే స్నేహితుడు చెల్లెలి పెళ్లి కోసం త‌న కార్ తీసుకున్నాడ‌ని, వాడి త‌మ్ముడి ఆటో ఒక్క రోజు న‌డ‌ప‌మ‌ని త‌న‌కు ఇచ్చాడ‌ని రోహిణి విన‌ప‌డేలా కావాల‌నే మాట్లాడుతాడు బాలు. చూసేవాళ్లు తాను కారు కాకుండా ఆటోన‌డుపుతున్నాన‌ని అనుకుంటార‌ని అంటాడు. బాలు ఆటో రోహిణి ఎక్కిన విష‌యం క్లూస్ ఇస్తూ రాజేష్‌కు అర్థ‌మ‌య్యేలా వివ‌రిస్తాడు.

ఎక్క‌డికి వెళ్లాల‌ని రోహిణితో పాటు ఎక్కిన మ‌రో అమ్మాయిని అడుగుతాడు బాలు. క్వీన్ బ్యూటీ పార్ల‌ర్ అని చెప్ప‌బోతుండ‌గా ఆమె నోరు మూస్తుంది రోహిణి. మ‌న పార్ల‌ర్ అని అంటుంది. పార్ల‌ర్‌కు కొంచెం దూరంలో ఆటో ఆపేసి దిగుతుంది. డ‌బ్బులు ఇవ్వ‌కుండా వెళ్లిపోతుంటే రెండు వంద‌లు కిరాయి అన...