భారతదేశం, మే 20 -- ఇజ్రాయెల్ దాడులు గాజాను వణికిస్తున్నాయి. సోమవారం రాత్రి, మంగళవారం కూడా దాడులు కొనసాగాయి. ఓ నివాసం, ఆశ్రయంగా మారిన ఓ పాఠశాలపై బాంబులు పడ్డాయి. ఈ దాడుల్లో కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ తీరుపై విమర్శలు తీవ్రమవుతున్నాయి.

హమాస్ బంధించిన డజన్ల కొద్దీ బందీలను విడిపించడానికి, ఉగ్రవాద సంస్థను నాశనం చేయడానికి ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. తాజా దాడులు మొదలైనప్పటి నుంచి గాజాలో 300 మందికి పైగా చనిపోయినట్లు స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గాజాను ఆక్రమించుకుని, లక్షలాది మంది ప్రజలను స్థానభ్రంశం చేసి, సహాయ పంపిణీని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ యోచిస్తోంది.

కాగా యుద్ధంతో దెబ్బతిన్న దాదాపు ...