భారతదేశం, మే 3 -- సంక్రాంతికి వ‌స్తున్నాం ఫేమ్ ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించిన గ‌రుడ 2.0 మూవీ ఇటీవ‌ల డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీలో అరుళ్‌నిధి హీరోగా న‌టించాడు. మ‌ల‌యాళం మూవీ మెమోరీస్‌కు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

ఆల్క‌హాలిక్ పోలీస్ ఆఫీస‌ర్‌...

అర‌వింద్ (అరుళ్‌నిధి) ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌. ధైర్యం, తెలివితేట‌ల‌తో ఎన్నో కేసుల‌ను సాల్వ్ చేస్తాడు. భార్య మియాతో (ఐశ్వ‌ర్య‌రాజేష్‌) పాటు కూతురు మీనూ చ‌నిపోవ‌డంతో అర‌వింద్ తాగుడుకు బానిస‌గా మారిపోతాడు. పోలీస్ జాబ్‌కు లీవ్ పెట్టేసి ఎప్పుడూ బార్‌లోనే గ‌డుపుతుంటాడు. తిరిగి డ్యూటీలో జాయిన్ అయితేనే అర‌వింద్ మామూలు మ‌నిషిగా మారుతాడ‌ని అత‌డి త‌ల్లి భావిస్తుంటుంది. సిటీలో కొత్త‌గా పెళ్లైనా కొంద‌రు యువ‌కులు చ‌నిపోతుంటారు. వారంద‌రిని ఓ సీరియ‌ల్ కిల్ల‌...