Telangana,hyderabad, సెప్టెంబర్ 5 -- గణేష్ నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక అప్డేట్ ఇచ్చింది. రేపు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో మెట్రో రైళ్ల టైమింగ్స్ ను పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్ మెట్రో సంస్థ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 6వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచే మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటలకు మొదటి రైలు ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 7వ తేదీ అర్థరాత్రి ఒంటి గంటకు చివరి రైలు ఉంటుంది. అన్ని స్టేషన్ల నుంచి నాన్ స్టాప్ గా సర్వీసులు నడవనున్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....