భారతదేశం, జనవరి 6 -- భారతదేశం తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని (2026) అత్యంత వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. దేశ సైనిక పటిమను, సాంస్కృతిక వైవిధ్యాన్ని కళ్లకు కట్టే ఈ అద్భుత ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజల్లో ఎంతో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి ప్రారంభమైన పరేడ్ టికెట్ల విక్రయాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం కొన్ని గంటల్లోనే తొలిరోజు కేటాయించిన కోటా మొత్తం అయిపోవడం విశేషం.
గణతంత్ర వేడుకల కోసం కేటాయించిన రోజువారీ 2,225 టికెట్లు అమ్మకాలు మొదలైన కొద్దిసేపటికే అమ్ముడయ్యాయని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే జనవరి 29న జరిగే 'బీటింగ్ రిట్రీట్' వేడుకకు సంబంధించి 692 టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలోనే క్లోజ్ అయ్యాయి. ఈ ఏడాది వేడుకలను వీక్షించేందుకు ప్రజలు ఎంత ఆసక్తిగా ఉన్నారో ఈ రద్దీని చూస్తుంటే అర్థమవుతోంది.
...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.