Hyderabad, మే 30 -- మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 2010లో వచ్చిన మూవీ ఖలేజా. అప్పట్లో ఈ మూవీ ఎవరికీ పెద్దగా ఎక్కపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ మూవీని రీరిలీజ్ చేశారు. దీంతో శుక్రవారం (మే 30) థియేటర్లు మహేష్ అభిమానులతో నిండిపోయాయి. అయితే ఈ రీరిలీజ్ లో ఓ పాట, డైలాగ్స్ కట్ చేయడంతో కొందరు ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు.

ఈ రీరిలీజ్‌ల కాలంలో ఒకప్పటి బ్లాక్‌బస్టర్లు, సూపర్ హిట్ సినిమాలు మళ్లీ 4కే వెర్షన్ లో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వస్తున్నాయి. అలా మహేష్ బాబు నటించిన ఖలేజా కూడా శుక్రవారం (మే 30) రీరిలీజైంది. అయితే ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సీన్లు, డైలాగులు, పాట కట్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో థియేటర్లలో రచ్చరచ్చ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వ...