భారతదేశం, ఏప్రిల్ 26 -- జెర్సీ ఫేమ్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ మ‌రో కొత్త ప్ర‌యోగంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సైన్స్ ఫిక్ష‌న్‌, అడ్వెంచరస్ థ్రిల్లర్ క‌థాంశంతో కలియుగమ్ 2064 అనే సినిమా చేస్తోంది. ఈ మూవీలో కాంతార ఫేమ్ కిషోర్‌ కీలక పాత్ర‌లో న‌టిస్తోన్నాడు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతోన్న ఈ బైలింగ్వ‌ల్ మూవీకి ప్ర‌మోద్ సుంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా మే 9న తమిళ,తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది. క‌లియుగ‌మ్ 2064 మూవీని తెలుగులో మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది.

క‌లియుగ‌మ్ 2064 తెలుగు ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ రిలీజ్ చేశాడు. ట్రైలర్ లాంచ్ అనంతరం దర్శకుడు "రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. " ట్రైల...