భారతదేశం, మే 14 -- క‌న్న‌డ వెబ్ సిరీస్ అయ్య‌నా మానే తెలుగులోకి వ‌చ్చేస్తోంది. ఈ మ‌ర్డ‌ర్‌ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ తెలుగు వెర్ష‌న్ మే 16 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని జీ తెలుగు ఆఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌లో ఖుషి ర‌వి, అక్ష‌య‌ నాయ‌క్‌, మాన‌సి సుధీర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సిరీస్‌కు శృతినాయుడు క్రియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా ర‌మేష్ ఇందిర‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జీ5 ఓటీటీలో రిలీజైన ఫ‌స్ట్ క‌న్న‌డ ఒరిజిన‌ల్ వెబ్‌సిరీస్‌గా అయ్య‌నా మానే నిలిచింది.

అయ్య‌నా మానే క‌న్న‌డంలో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. రిలీజైన ఐదు రోజుల్లోనే యాభై మిలియిన్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించింది. క‌న్న‌డంతో పాటు హిందీ, త‌మిళ భాష‌ల్లో ఈ వెబ్‌స...