Andhrapradesh, అక్టోబర్ 9 -- దక్షిణ ఒడిశా నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ దక్షిణ ఒడిశా నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ,తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడనున్నాయి.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం. అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

శుక్రవారం(10-10-25) : అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ...