Andhrapradesh, జూన్ 8 -- ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జామ్స్. 30 తేదీతో పూర్తికానున్నాయి. విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం. సబ్జెక్టుల వారీగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. చివరిరోజు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) పరీక్షతో అన్ని పేపర్లు ముగుస్తాయి.

విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. అంటే జున్ 30వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయి. జూలై 2వ తేదీన ప్రాథమిక కీలను విడుదల చేస్తారు.

విద్యాశాఖ విడుదల చేసే ప్రాథమిక కీలపై 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన మరో 7 రోజుల తర్వాత ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువస...