భారతదేశం, మే 15 -- ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మే 7 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త కార్డుల నమోదు, కార్డుల్లో మార్పుచేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటిని అంచెలంచెలుగా పరిశీలించి 21 రోజుల్లో కార్డులు జారీ చేయనున్నారు. నేటి(మే 15) రేషన్ కార్డుల దరఖాస్తులను వాట్సాప్ మన మిత్రలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ప్రకటించారు.

రేషన్ కార్డుల దరఖాస్తులపై వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం మూడు సవరణలు చేసినట్లు తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ లో ప్రకటించారు.

1. బియ్యం కార్డును విభజించడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదు

2. బియ్యం కార్డును స్వచ్ఛందగా సరెండర్ చేయవచ్చు.

3. వలస వెళ్లిపోతే బియ్యం కార్డును తొలగిస్తారు.

కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుతో పాటుగా స్పిల్టింగ్‌కు కూడా ...