భారతదేశం, మే 21 -- ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, మార్పు చేర్పుల కోసం వస్తున్న వారితో గ్రామ, వార్డు సచివాలయాలు, హడావుడిగా కనిపిస్తున్నాయి. దరఖాస్తు ప్రక్రియపై మరో అప్డేట్ వచ్చింది.

ఏపీలో కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరంలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

రైస్ కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒంటరి మహిళల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది వెళ్లి ధ్రువీకరించి, కార్డులను అందిస్తారని చెప్పారు. ఒంటరి మహిళలకు సింగల్ మెంబర్ కార్డులు అందిస్తామని ఇప్పటికే ప్రకటించామన్నారు. భార్యభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటిత...