Telangana, జూన్ 8 -- తెలంగాణ కేబినెట్ విస్తరణ ప్రక్రియలో అడుగు ముందుకు పడింది. ఆరు ఖాళీలకు గాను మూడు బెర్తులను భర్తీ చేశారు. కొత్తగా వి.శ్రీహరి ముదిరాజ్, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లకు అవకాశం కల్పించింది. వీరితో ఇవాళ రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ జిష్ణదేవ్ శర్మ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.

కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన ఈ ముగ్గురు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే కావటం విశేషం. వివేక్ గతంలో ఎంపీగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ విజయం సాధించారు. ఇక మక్తల్ నుంచి వాకిిటి శ్రీహరి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా గెలిచారు.

కొత్తగా మంత్రులుగా నియమితులైన వారికి గవర్నర్ తో పాటు ముఖ్యమంత...