భారతదేశం, మే 15 -- పూరి జగన్నాథ్.. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకరు. ఒకప్పుడు వరుస హిట్లతో హీరోలను ఫ్యాన్స్ చూసే కోణాన్నే మార్చేశారు ఆయన. హీరోను డిఫరెంట్ గా ఎలివేట్ చేయడమే పూరి మార్క్. కానీ ఇటీవల పూరి జగన్నాథ్ ను వరుస ఫెయిల్యూర్స్ బాధిస్తున్నాయి. సక్సెస్ కోసం చూస్తున్న పూరి కొంత గ్యాప్ తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నారు. తమిళ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో తన కొడుకు ఆకాష్ పూరికి పూరి ఛాన్స్ ఇచ్చారని టాక్.

పైసా వసూల్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ కు హిట్ లేదు. మెహబూబా, ఇస్మార్ట్ శంకర్, లైగర్, డబుల్ ఇస్మార్ట్.. ఇలా వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. అందుకే ఇప్పుడు హిట్ కొట్టాలని మంచి కథతో విజయ్ సేతుపతితో పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛ...