భారతదేశం, డిసెంబర్ 4 -- కేరళలోని ప్రకృతి అందాలను ఒక్క మాటల్లో వర్ణించలేం. పచ్చని ప్రకృతి అందాలతో పాటు దానికితోడు బోటులో జర్నీ చేస్తూ.. మంచి మంచి ప్రదేశాలను చూడొచ్చు. ప్రస్తుత సీజన్ లోనూ చాలా మంది కేరళ ట్రిప్ కు వెళ్తుంటారు. ఆసక్తి గల టూరిస్టుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ఐఆర్సీటీసీ టూరిజం 'కేరళ హిల్స్ అండ్ వాటర్స్ ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి జర్నీ ఉంటుంది. ఈ ట్రిప్ లో భాగంగా అలెప్పీ, మున్నార్ తో పాటు మరికొన్ని టూరిస్ట్ స్పాట్లు చూస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 9 డిసెంబ్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవాలి.

ఐఆర్సీటీసీ టూరిజం తెలిపిన వివరాల ప్రకారం. సింగిల్ షేరింగ్ కు రూ.33,390, డబుల్ షేరింగ్ కు రూ.19,440 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ....