భారతదేశం, మే 23 -- ిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రూ.2.1 లక్షల కోట్ల కంటే ఎక్కువ. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెల్లింపులు రూ.87,416 కోట్లుగా ఉన్నాయి.

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిని సమీక్షించారు. ఏప్రిల్ 2024-మార్చి 2025 మధ్య రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై చర్చించిన బోర్డు 2024-25 సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను ఆమోదించింది. దీంతో పాటు రూ.2.69 లక్షల కోట్ల మిగులును కేంద్ర ప్రభుత్వానికి...